Friday, April 19, 2024

సుప‌రిపాల‌నే వైసిపి ల‌క్ష్యం . మంత్రి పెద్దిరెడ్డి..

రాపూరు, : రాష్ట్రంలోని పేద ప్రజ లందరికీ సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ, వలంటీ-ర్ల వ్యవస్థ ద్వా రా ప్రజలందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథ కాలను అందజేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల పోటీ- చేస్తున్న వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి కి మద్దతుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి, మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన రాపూరుకి మూడు కిలోమీటర్ల దూరంలోని మద్దెల మడుగు సెంటర్‌లో ఏర్పాటు -చేసిన వైసీపీ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొని తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి కి మద్దతుగా నిలిచారు. ఈ సభలో నెల్లూరు జిల్లా మాజీ చైర్మన్‌ ధనంజయ రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్‌ చెన్ను బాలకృష్ణా రెడ్డి, వైసీపీ రాష్ట్ర, జిల్లా, మండల అగ్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement