Friday, May 3, 2024

క్షమాపణలు చెప్పిన ప్రదీప్….రాజధాని రచ్చ

ఇటీవల ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే యాంకర్ ప్రదీప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా ఇదే విషయమై యాంకర్ ప్రదీప్ స్పందించారు. ఈ మేర ఓ వీడియోను విడుదల చేశారు. ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించాలని అని కోరారు.

తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని ఎవరినీ కించపరచాలని ఈ విధంగా చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రం రాజధాని అనే అంశంపై టీవీ షోలో ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం వచ్చిందని వాస్తవానికి ఇలాంటి అంశాలకు దూరంగా ఉంటానని…. వినోదం అందించడమే తన ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. దయచేసి ఈ వవిషయంలో క్షమించాలని మీ అందరి ఆశీస్సులు కావాలి అని కోరారు ప్రదీప్.

https://youtu.be/VkdTm27rI30
Advertisement

తాజా వార్తలు

Advertisement