Wednesday, May 1, 2024

ప్ర‌శాంత్ నీల్ తో ప్ర‌భాస్ మ‌రో చిత్రం..

బాహుబలితో ప్రభాస్‌, కేజీఎఫ్‌తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సినీరంగంలో సంచలనం సృష్టించారు. వీరిద్దరి కలయికలో ఇప్పుడు సలార్‌ సినిమా రూపొందుతోంది. ప్రభాస్‌ నటిస్తుండగా రూపొందుతున్న అత్యంత భారీ చిత్రమిది. ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ తర్వాత మరో చిత్రం చేయనున్నారనేది తాజా వార్త. అది కూడా పౌరాణిక చిత్రం చేస్తారట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు.
కేజీఎఫ్‌ 2 తర్వాత ప్రశాంత్‌ నీల్‌ జూ.ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తిచేశాక ప్రభాస్‌తో సినిమా చేస్తారని దిల్‌ రాజు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్దమైందని కూడా చెప్పారు.
పక్కా మాస్‌ పల్స్‌ తెలిసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది స్టార్స్‌ సిద్దంగా ఉన్నారు. కానీ ప్రభాస్‌తోనే మరో చిత్రం చేయడానికి ఆయన మొగ్గుచూపడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement