Friday, May 3, 2024

పవన్ రానా కూడా వచేస్తున్నారు!!

కరోనా కారణంగా చాలా సినిమా షూటింగ్ లో వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్ లు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ సినిమా షూటింగ్ కూడా ఈ రోజు నుండి స్టార్ట్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగులో పాల్గొన బోతున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఏర్పాటుచేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ జరగనుంది.

అయితే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement