Friday, May 3, 2024

సినీ ప్రేక్షకులకు పండుగే.. కొత్త సినిమాలు ఏమున్నయంటే..

కరోనా వల్ల‌ సినీ ఇండ‌స్ట్రీపై భారీ ప్ర‌భావ‌మే ప‌డింది. ఎన్న‌డో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు క‌రోనా వ‌ల్ల థియేట‌ర్లు మూసి వేయ‌డంతో రిలీజ్ డేట్ ల‌ను పోస్ట్ పోన్ చేస్తూ వ‌చ్చారు నిర్మాత‌లు. అయితే.. క‌రోనా తగ్గిన తర్వాత రిలీజైన ‘అఖండ’, ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్​ సినిమాలు విజయాలు అందుకోవడంతో టాలీవుడ్ కు కొత్త జోష్ వచ్చింది. ఈ సినిమాలు ఇచ్చిన ధైర్యంతో పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోపక్క, ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు ఓటీటీలో కడా సంద‌డి చేస్తున్నాయి. కాగా, ఈ వారం ఇటు థియేట‌ర్ల‌లో.. అటు ఓటీటీలొ విడుద‌ల కానున్న సినిమాలు ఏమున్నయో చూద్దాం..

థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు..
దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ జంటగా న‌టించిన‌ ‘హే సినామికస మూవీ మార్చి 3న విడుదల కానుంది. నృత్య దర్శకురాలు బృందా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

శర్వానంద్, రష్మిక న‌టిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం మార్చి 4న విడుదలకానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందించగా.. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించారు.

విభిన్న కథాంశంతో తెర‌కెక్కుతున్న‌ చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’ కిరణ్ అబ్బవరం హీరోగా న‌టించిన ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు.

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు…
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ మార్చి 4న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.
విశాల్, డింపుల్ హయతీ నటించిన ‘సామాన్యుడు’ చిత్రం మార్చి 4న జీ5లో విడుదల కానుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement