Friday, May 17, 2024

పురుగుల మందు తాగి ప్రముఖకవి ఆత్మహత్య

ప్రముఖ కవి సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా సత్యనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందాడు. సత్యనారాయణ స్థలం తూర్పుగోదావరి జిల్లా కరప మండలం గురజనాపల్లి.

పెద్దల మాట చద్ది మూట, మద్ద వారి మణిపూసలు, తరువోజ, పదవులు ఉన్నవాళ్లకు పసుపు కుంకుమలు, ఆశాజ్యోతి అంబేద్కర్, వంటి రచనలు చేశారు సత్యనారాయణ. అంతేకాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా పని చేశారు అక్షర సత్య సేవా సంస్థను నెలకొల్పి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement