Wednesday, May 1, 2024

ఖైర‌తాబాద్ ఆర్టీఏ కార్యాల‌యంలో.. ర‌వితేజ‌

న‌టీన‌టులు ల‌గ్జ‌రీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే వారి ద‌గ్గ‌ర ఖ‌రీదైన కార్లు కూడా ఉంటాయి..కాగా హీరో రవితేజ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. రీసెంట్ గా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు ర‌వితేజ‌. ఖరీదైన ఎలక్ట్రిక్ కారుని కొన్నారు. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. రవితేజ కొనాలనుకుంటే ఎంతటి ఖరీదైన కారుని అయినా సొంతం చేసుకోవచ్చు. కానీ ఈసారి రవితేజ ఎలక్ట్రిక్ వాహనంపై మక్కువ చూపించాడు. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 34 లక్షల 49 వేలు. ఇది చైనాకి చెందిన కంపెనీ తయారు చేసిన వాహనం. BYD ATTO 3 EV అనే మోడల్ కి చెందింది.

రవితేజ TS09GB2628 ఫ్యాన్సీ నంబర్ ని వేలంలో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నంబర్ కోసం రవితేజ ఏకంగా రూ 17,628 వెచ్చించి వేలంలో దక్కించుకున్నారు. కాగా ఈ ఎలక్ట్రిక్ కారులో అనేక సదుపాయాలు ఉన్నాయి. ఇది అత్యంత సురక్షితమైన వాహనంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్,ఆండ్రాయిడ్, ఫరోనామిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, పవర్ టైల్ గేట్ లాంటి అద్భుతమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇన్ని ఫీచర్లు కలిగి ఉంది కాబట్టే రవితేజ ఎంతో ఇష్టపడి ఈ వాహనాన్ని కొన్నారు. ఈ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం రవితేజ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఈ వాహనం కోసం రిజిస్ట్రేషన్ పనుల కోసం రవితేజ స్వయంగా ఆర్టీఏ కార్యాలయానికి హాజరయ్యారు. దీనితో ఆర్టీఏ అధికారులు రవితేజతో సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. ఈ ఫొటోల్లో రవితేజ లాంగ్ హెయిర్ పెంచుతూ కనిపిస్తున్నట్లు అర్థం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement