Monday, April 29, 2024

Guntur Karam | సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ​ !

సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు మేకర్స్.

ఈ నెల 11న సాయంత్రం 4.05 గంటలకు ‘ఓ మై బేబీ’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ కానుంది. ఇక ఫల్ సాంగ్ డిసెంబరు 13న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇటీవలే ‘గుంటూరు కారం’ నుంచి తొలి సింగిల్ ‘దమ్ మసాలా’ లిరికల్ వీడియో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మహేశ్ మాస్ స్టామినాను ఎలివేట్ చేస్తూ సాగిన ఈ పాటకు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement