Thursday, April 25, 2024

గుడుంబా శంక‌ర్.. రీ రిలీజ్

న‌టుడు..నిర్మాత నాగ‌బాబు నిర్మించిన గుడుంబా శంక‌ర్ చిత్రం రీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టించారు. ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కాబోతుంది.ఈ సినిమాను పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత నాగబాబు నిర్మించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే ప్రతినాయకులుగా నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. వీరశంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రీరిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement