Friday, April 19, 2024

Tirupati: రేణిగుంట సమీపంలో చిరుత సంచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. నివాస ప్రాంతాలకు సమీపంలో చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. ఇళ్ల సమీపంలో గల పొదల్లో చిరుత సంచరించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే దానిని చిరుత పిల్లగా గుర్తించారు. చిరుత పిల్ల అక్కడికి రావడంతో దాని తల్లి ఆ సమీప ప్రాంతాల్లోనే ఎక్కడో ఒక చోట ఉంటుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement