Saturday, April 27, 2024

AP : శ్రీ‌వారి సేవ‌లో సినీ నటుడు బ్ర‌హ్మానందం…శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ…

సినీ నటుడు బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మానందం వచ్చారు.

ఈ సందర్భంగా సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ…సహజ అంశాన్ని కళాకారుడు తన నైపుణ్యంతో జీవకళ ను జొడించితే అద్భుతాల సాధ్యమన్నారు.
మరణించిన కళాకారుడు కుటుంబానికి రెండు లక్షలా 17వేలు అందించారు బ్రహ్మనందం. మిత్రుడు సలహాతో నేను చిత్రీకరించిన చిత్రాన్ని ముద్రించడం గర్వకారణం అని తెలిపారు. కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ అందరికీ రావు… అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యమన్నారు. కళాకారులు తమ బాహ్య రూపానికి కంటే అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు…గడ్డిపువ్వులో అందాన్ని చూస్తేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్ధమవుతుందని వివరించారు సినీ నటుడు బ్రహ్మానందం.

Advertisement

తాజా వార్తలు

Advertisement