Sunday, May 5, 2024

drugs case:ముగిసిన తరుణ్ విచారణ..

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది.

ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు విచారించిన ఈడీ.. సెప్టెంబర్ 2న ఛార్మినీ 8 గంటల పాటు విచారించింది. ఇక సెప్టెంబర్ 6న హాజరు కావాల్సి రకుల్, ఈడీ అనుమతితో సెప్టెంబర్ 3నే హాజరు హాజరైంది. ఆమెను 6 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 20న హాజరు కావాల్సిన నందు, సెప్టెంబర్ 7న హాజరైయ్యాడు. అదేరోజు కెల్విన్ , జీశాన్ ల ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 8న రానాను 8 గంటల పాటు విచారించగా.. రానా, నందు విచారణకు హాజరైన రోజుల్లో కెల్విన్, జీశాన్ లను కలిపి ఈడీ విచారించింది.

సెప్టెంబర్ 9న రవితేజతో పాటు, డ్రైవర్ శ్రీనివాస్ ను 6 గంటల పాటు విచారించగా.. సెప్టెంబర్ 13న నవదీప్ తో పాటు, ఎఫ్ క్లబ్ మేనేజర్ ను 9 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్ ను 7 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 17న తనీష్ ను 7 గంటల పాటు విచారించగా.. సెప్టెంబర్ 22న తరుణ్ ను 8 గంటల పాటు ఈడీ విచారించింది. విచారణకు తమతో పాటు తమ చార్టెడ్ అకౌంట్ లను పలువురు తారలు తీసుకొచ్చారు.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement