Friday, April 26, 2024

మరోసారి చిరును కలిసిన వెంకీ కుడుముల

ఛలో, భీష్మ వంటి చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. అయితే తాజాగా వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవి ని కలిశారు. గతంలో భీష్మ సినిమా హిట్ కొట్టిన తర్వాత చిరంజీవిని కలిశారు. ఇప్పుడు మరోసారి కలిసారు. ఈ విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు వెంకీ. ఎన్ని సార్లు కలిసినా కూడా చిరంజీవి గారిని చూస్తే అలా స్ట్రక్ అయిపోతాను. ఆశ్చర్యపోతూ ఉంటాను.

ఆయన చుట్టూ ఉండే ఆరా ఆయన ఉండే విధానం అన్నీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అందుకే కాబోలు ఆయన మెగాస్టార్ అయ్యారు…అంటూ చెప్పుకొచ్చారు వెంకీ కుడుముల. కాగా చిరంజీవిని వెంకీ కుడుముల కలవడానికి వెనుక ఉన్న కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే నెటిజన్స్ మాత్రం కామెంట్ల రూపంలో తమ ప్రశ్నలను వెంకీ పై సంధిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement