Monday, April 29, 2024

మిథాలీ రాజ్ బయోపిక్ నుంచి తప్పుకున్న దర్శకుడు

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హీరోయిన్ తాప్సీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఆ తరువాత తెలుగులో అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు ఏవి కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది తాప్సీ. అయితే సూపర్ హిట్ చిత్రాలతో అక్కడ ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటిస్తుంది తాప్సి.

శభాష్ మిథూ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిథాలీ రాజ్ గా కనిపించనుంది. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్న రాహుల్ దొలకియా ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. రాహుల్ స్థానంలో శ్రీజిత్ ముఖేర్జీ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన ఎందుకు ఈ సినిమా నుండి తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement