Friday, April 19, 2024

వకీల్ సాబ్.. థియేటర్లో దిల్ రాజు రచ్చ!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వకీల్‌సాబ్’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల వద్ద  అభిమానులు సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ ప్రతి థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. దీంతో కొద్ది రోజులుగా పవన్ నామస్మరణతో రెండు రాష్ట్రాలు ఊగిపోతోన్నాయి. వేరే ప్రాంతాల్లో ఉన్న ఫ్యాన్స్ సైతం సందడి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సినిమా ప్రీమియర్ షో వీక్షించిన నిర్మాత దిల్​రాజు థియేటర్లో పేపర్లు విసురుతూ పవన్​పై తన అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్​లో ఈ సినిమాను వీక్షించిన నిర్మాత దిల్​రాజు థియేటర్లో ఓ ఫ్యాన్​గా సందడి చేశారు.

శివపార్వతి థియేటర్లో కుటుంబంతో సహా ప్రీమియర్ షో వీక్షించిన దిల్​రాజు.. థియేటర్లో కాగితాలు విసురుతూ సందడి చేశారు. భార్య పక్కనే ఉందన్న విషయాన్ని సైతం మర్చిపోయి మరీ సినిమా చూస్తూ.. ఈలలు వేస్తూ.. కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ‘వకీల్ సాబ్’ ఈ రోజు ఉదయం రిలీజ్ కాగా, ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఆంధ్రప్రదేశ్ లో రద్దయినా, తెలంగాణలోని కొన్ని థియేటర్లలో చిత్ర తొలి షో పూర్తయింది. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్, ఇది సూపర్ హిట్ అని, కనీసం రూ. 100 కోట్ల కలెక్షన్ ఖాయమని అంటున్నారు.

కాగా, వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement