Wednesday, May 8, 2024

విడుదలకు ముందే సీక్వెల్ కు రెడి అంటున్న ధనుష్

విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తమిళ స్టార్ హీరో ధనుష్ ఎప్పుడూ ముందుంటారు. అయితే ధనుష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం జగమే తంత్రం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ధనుష్ ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో చేసిన పాత్ర తనకు ఎంతో ఇష్టమైన పాత్ర అని వీలుంటే ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేయాలని ఉందని చెప్పుకొచ్చారు.

కార్తీక్ సుబ్బరాజ్ మంచి ఐడియా ఆలోచిస్తే అది కుదురుతుందని అన్నారు ధనుష్. కాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఒకటి లేదా రెండు నెలల తర్వాత టీవీలలో కూడా ప్రసారం కానుంది. టీవీలో ప్రసారమయ్యే వెర్షన్ లో ఓటీటీ లో రిలీజ్ అయ్యే వెర్షన్ కంటే రెండు పాటలను అదనంగా ఉంచుతున్నారు చిత్రయూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement