Wednesday, May 1, 2024

నాన్న గారు గుర్తుకొచ్చారు…. ఎస్పీ చరణ్

కొంత మంది సినీస్టార్స్ చనిపోయిన తరువాత కూడా గుర్తిండిపోతారు.ఏదో ఒక విధంగా వాళ్ళని తలుచుకుంటూ ఉంటాము…అలాగే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెంది 8 నెలలు గడుస్తున్నా….అతనిని ఎవరూ మరచిపోలేదు. అలాగే అతని కొడుకు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రిని తలుకుని ఎమోషనల్ అయ్యాడు. తాజాగా క్లింట్ ఈస్ట్ ఉడ్ తెరకెక్కించిన రిచర్డ్ జ్యువెల్ మూవీని చూసి… తన తండ్రిని ఎంత మిస్ అయ్యాడో మరోసారి తలుచుకున్నాడు చరణ్. ఏదైనా హాలీవుడ్ సినిమా చూడగానే, అది నచ్చితే వెంటనే తండ్రికి సజెష్ చేసే వాడట చరణ్. బాలుగారు ఎంత బిజీగా ఉన్నా అదే రాత్రి ఆ సినిమాను చూసేసే వారట. అలా క్లింట్ ఈస్ట్ ఉడ్ నటించి, నిర్మించి దర్శకత్వం వహించిన ‘ది మ్యూల్’ చిత్రాన్ని తండ్రికి చూడమని చెప్పగానే, దానిని చూసిన బాలు… ఆ మర్నాడు అంతా ఆ సినిమా గురించే మాట్లాడుతూ ఉన్నారని చరణ్ తలుచుకున్నాడు.

ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా క్లింట్ ఈస్ట్ ఉడ్ ను ఉద్దేశించి చెబుతూ, మీరు రూపొందించిన రిచర్డ్ జ్యువెల్ మూవీ చూశాను. ఆణిముత్యం లాంటి ఈ సినిమాను చూడమని చెప్పడానికి మా నాన్న నా పక్కన లేరు. నేను ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండండి. ఓ గొప్ప చిత్రాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు చరణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement