Friday, April 26, 2024

బుట్ట బొమ్మ పూజా హెగ్డే కు కరోనా

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. ఇప్పటికే పలువురు కరోనా కారణంగా మృతి చెందారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆమె స్వయంగా ప్రకటించారు.

నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలపాలని అనుకున్నాను. నియమ నిబంధనలు పాటిస్తూ నిర్బంధంలోకి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. అలాగే ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందరూ ఇంట్లోనే ఉండండి కరోనా నుంచి కాపాడుకోండి అంటూ బుట్ట బొమ్మ పూజ ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement