Friday, April 26, 2024

అయ్యప్ప సన్నిధిలో అజయ్ దేవగణ్..

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. ఇరుముడితో ఆయన మణికంఠుని దర్శించటం ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చగా మారింది. ఆయన దీక్షలో ఉండగా తీసిన ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

అయ్యప్ప దీక్ష సమయంలో భూ శయనం, చెప్పులు లేకుండా నడవటం దక్షిణాది వారికి పెద్ద వింతేమీ కాదు. అయితే, మన సౌత్ హీరోల మాదిరిగా అయ్యప్ప దీక్ష చేయటం బాలీవుడ్ స్టార్స్‌కి అరుదు. ఈ సారి అజయ్ దేవగణ్ నల్ల బట్టలు ధరించి, తలపై ఇరుముడితో హరిహర నందనుని పద్దెనిమిది మెట్లు ఎక్కటంతో… ఉత్తరాదిలో అది కాస్తా చర్చకు కారణమైంది. వందల కోట్ల ఆస్తులున్న ఆయన పదకొండు రొజుల పాటూ నేల మీద ఓ చాప పరుచుకుని పడుకున్నాడట. దీక్ష సాగినన్ని రోజులు సంపూర్ణ శాఖాహారం తీసుకున్నాడట. ఇక 11 రోజుల పాటూ ఆయన చెప్పులు లేకుండా తిరగటం కూడా కొంతమందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement