Friday, April 26, 2024

అ..!! సీక్వెల్ అందుకే వెనక్కి వెళ్లిందా ?

న్యాచురల్ స్టార్ నాని ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. గతేడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మించిన చిత్రం అ..! నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, మురళి శర్మ, రోహిణి, దేవదర్శిని తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ సాధించలేకపోయింది.

కాగా ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాకు సీక్వెల్ నిర్మిస్తామని దర్శక నిర్మాతలు అప్పుడు ప్రకటించారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రం తర్వాత రాజశేఖర్ తో కల్కి, జాంబి రెడ్డి చిత్రాలు చేశాడు. అయితే అ..!! సీక్వెల్ మాత్రం స్టార్ట్ చేయలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రశాంత్ వర్మ తాజాగా స్పందించారు. అ2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని దీనిని ఓ బాలీవుడ్ స్టార్ తో పాన్ ఇండియా మూవీ కి రూపొందించాలని భావిస్తున్నాను. బాలీవుడ్ స్టార్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నానని దీంతో అ సినిమా వెనక్కి వెళ్లిందని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement