Friday, May 3, 2024

నో అప్ డేట్ అంటోన్న డైరెక్టర్

 దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని చేయబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.   ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభిచాలని ప్లానింగులో ఉన్న ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందనుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడని టాక్. ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె నటించనుంది. ఇక సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫికల్ విసువల్ వండర్ గా రూపొందిస్తారట. అయితే ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. అలాగే ఇటీవల ఫిబ్రవరి 26న ఓ అప్డేట్ ఇస్తానని చెప్పాడు. అలా చెప్పేసరికి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా 26న ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని చెప్పి నిరాశపరిచాడు డైరెక్టర్. మరి కారణాలు తెలియదు గాని ఇప్పుడైతే సరైన సమయం కాదంటూ ట్వీట్ చేసాడు. ఈ దెబ్బతో ఫ్యాన్స్ భారీ షాక్ లో ఉండిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement