Friday, April 26, 2024

కిరాతక షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!!

ఆది సాయి కుమార్ గురించి తెలుగు సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కిరాతక అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. అలాగే సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం… రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 13 నుంచి స్టార్ట్ చేయబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారి పోస్టర్ ను రిలీజ్ చేసింది. వీరభద్రం ఆది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో చుట్టాలబ్బాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement