Wednesday, July 24, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిసాయి. రోజు మొత్తం లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు చివరికి కూడా అదే జోరును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 318 పాయింట్లు పెరిగి 54,844కి ఎగబాకింది. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 16,364 వద్ద స్థిరపడింది. వీక్లీ ఎఫ్ అండ్ ఓ గడువు ముగుస్తున్న తరుణంలో మార్కెట్లు హుషారుగా కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.22%), టెక్ మహీంద్రా (4.66%), టైటాన్ కంపెనీ (2.60%), ఎల్ అండ్ టీ (2.33%), ఎన్టీపీసీ (1.41%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.16%).టాప్ లూజర్స్:డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.67%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.38%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.30%), యాక్సిస్ బ్యాంక్ (-0.24%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.22%).

ఇది కూడా చదవండి: పెళ్లి సందడి షురూ.. ముహూర్తాలే ముహూర్తాలు!!

Advertisement

తాజా వార్తలు

Advertisement