Monday, July 22, 2024

Elon Musk | ఓపెన్‌ ఏఐ సీఈఓపై ఎలాన్‌ మస్క్‌ కేసు

లాభాలను ఆర్జించడం కంటే, మానవాళికి మేలు చేయడం తమ సంస్థ లక్ష్యమని చెప్పి, ఆ మాట తప్పారని ఓపెన్‌ఏఐ, ఆ సంస్థ సీఈఓ శామ్‌ అల్ట్‌మెన్‌పై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కేసు వేశారు. లాభాపేక్ష రహితంగా ఉంటూ ప్రజలు ప్రయోజనార్ధం సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థగా ఉండాలని ఓపెన్‌ఏఐ ఏర్పాటు సమయంలో ఆల్ట్‌మెన్‌, ఆ సంస్థ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ బ్రాక్‌మన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మస్క్‌ పేర్కొన్నారు.

ఏ ఒక్క ప్రైవేట్‌ కంపెనీకి లాభాలను తెచ్చిపెట్టేందుకు కాకుండా, తన కోడ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీనున్నట్లు కూడా వ్యవస్థాపిత ఒప్పందంలో ఓపోన్‌ ఏఐ పొందుపరిచినట్లు వివరించారు. మైక్రోసాఫ్ట్‌తో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఓపెన్‌ఏఐ ఆ సంస్థ ఉన్నతాధికారులు ఈ ఒప్పందం ఉద్దేశాన్ని నీరుగార్చారని మస్క్‌ ఆరోపించారు. ప్రపంచంలోని అతి పెద్ద సాంకేతిక కంపనీ అయిన మైక్రోసాఫ్ట్‌కు అనధికారిక అనుబంధ సంస్థగా ఓపెన్‌ఏఐ మారిపోయింది.

మానవాళి ప్రయోజనం కోసం కాకుండా మైక్రోసాఫ్ట్‌ లాభాలను పెంచేందుకు ఓపెన్‌ఏఐ కొత్త బోర్డు పని చేస్తోందని మస్క్‌ విమర్శించారు. ఒప్పంద ఉల్లంఘన అనైతిక వ్యాపార పద్ధతులను అనుసరిస్తున్నట్లు తన పిటిషన్‌ల పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐ సాంకేతిక నుంచి మైక్రోసాఫ్ట్‌ సహా సంస్థా ప్రయోజనం పొందకుండా ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా మస్క్‌ కోర్టును కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement