Sunday, April 28, 2024

YSRCP – గుంటూరు జిల్లాలో నేడు జగన్ మేము సిద్ధం సభ

ఏపీలో రెండోసారి అధికారమే టార్గెట్‌గా సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది..

ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం ధూళిపాళ్ల నుంచి బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్ రావు నగర్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement