Wednesday, May 1, 2024

vizag: టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి

విశాఖ జిల్లాలో నక్కపల్లి మండలం వేంపాడులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పాయకరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులు.. వేంపాడు టోల్ గేట్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. టోల్ గేట్ వద్ద ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో డ్యూటీలో ఉన్న ఉద్యోగి సత్యనారాయణ కారును అడ్డుకున్నారు. టోల్ చెల్లించాలని కోరాడు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. తమనే అడ్డుకుంటావా? అంటూ వైసీపీ నేతలు టోల్‌ప్లాజా సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం విశాఖకు తరలించారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement