Friday, May 17, 2024

YSR Vahana Mitra – జ‌ర‌గ‌బోయేది కురుక్షేత్ర‌మే…. ప్ర‌జ‌లంద‌రూ త‌న‌కు అండ‌గా ఉండాల‌ని జ‌గ‌న్ పిలుపు..

విజయవాడ: కురుక్షేత్రం యుద్ధం జరగబోతుందని సీఎం జగన్ అన్నారు. ఐదో విడత వైఎస్సార్ వాహనమిత్ర నిధులను విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో సీఎం జగన్ విడుదల చేశారు. 2,75,931 మందికి పది వేల చొప్పున 275.93 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో వేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా వాహన డ్రైవర్ల కష్టాలు తెలుసుకొని వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా చెప్పారు. బతుకుబండి లాగడానికి ఇబ్బందిపడే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతీ ఏటా వాహనమిత్ర ద్వారా ఏడాదికి పదివేలు అందచేస్తున్నట్టు చెప్పారు.2,75,931 మందికి 275.93 కోట్లు బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఆటో, ట్యాక్సీలను నడుపుతున్న కుటుంబాలకు ఈ ఆర్ధిక సాయం చేదోడు వాదోడుగా ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. మీ వాహనాలకు సంబంధించి ఇన్స్యూరెన్స్, వాహనాల పిట్ నెస్ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోవాలని సీఎం డ్రైవర్లకు సూచించారు.వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారని మర్చిపోవద్దన్నారు.

తమ ప్రభుత్వం అందరి ప్రభుత్వంగా సీఎం జగన్ పేర్కొన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్ల స్ధలాలిచ్చి నిర్మాణం చేపడుతున్నట్టుగా చెప్పారు. ఇళ్ల వద్దకే బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ మీ ఇంటి వద్దకే వచ్చి జల్లెడ పడుతున్నారన్నారు.మన ఊళ్లలోనే ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పిస్తున్నట్టుగా సీఎం గుర్తు చేశారు. మీ వార్డు, గ్రామాలలో లంచాలు లేని వాలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలన్నీ మీ ఇంటి ముందుకే తెచ్చామని తెలిపారు. గ్రామ, వార్డు స్ధాయిల్లో మహిళ పోలీస్ ఏర్పాటు చేశామన్నారు. జగనన్న అరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలు చేయిస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఎవరో ఉద్యమాలు చేస్తే అమలు చేయలేదన్నారు. తన పాదయాత్రలో సమస్యలు గుర్తించి అమలు చేస్తున్నానని ఆయన వివరించారు.
ఇక ఎన్నిక‌లపై జ‌గ‌న్ మాట్లాడుతూ, ‘‘నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వం ఒక వైపు ఉంటే..‌ నిరుపేదలను వచ్చించిన వారు మరొక పక్క ఉన్నారు. సామాజిక అన్యాయాలు చేసే ప్రత్యర్థులతో యుద్ధం జరగబోతుంది. మ్యానిఫెస్టో లో ఉన్న అన్ని హామిలను అమలు చేశాం. మ్యానిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేసేసి అందులో పది శాతం కూడా‌ అమలు చేయని వారితో యుద్ధం జరగబోతుంది. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుడతారా అనే అహంకారానికి.. బీసీల పట్ల అనుచితంగా మాట్లాడుతూ కండకావరం పదర్శించిన వారితో యుద్ధం జరగబోతుంది. పేదలకు ఇంగ్లిష్ మీడియం ఉండకూడదన్న పెత్తందారులతో యుద్ధం జరగబోతుంది. 2 లక్షల 35 వేల కోట్లు లంచాలకు అవకాశం లేకుండా లబ్ధిదారులకు అందచేశాం. మీ బిడ్డ పరిపాలన వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్. కష్టాలను చెప్పుకోలేని వారి గొంతుకై నిలబడిన ప్రభుత్వం. పేదలు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో వారి సమస్యలకు పరిష్కారంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ’’ అని సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement