Monday, April 29, 2024

AP | ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి వైఎస్ విజయమ్మ ఓదార్పు

చంద్రగిరి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : పితృ వియోగంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఇతర కుటుంబ సభ్యులను సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఓదార్చారు. శుక్రవారం సాయంత్రం తుమ్మలగుంటకు వచ్చిన ఆమె ఐదు రోజుల క్రితం మృతిచెందిన చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి చిత్ర పటం వద్ద అంజలి ఘటించారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తల్లి మునిరత్నమ్మకు ధైర్యం చెప్పి ఓదార్చారు. తండ్రి మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మనోధైర్యంతో కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement