Sunday, April 28, 2024

ఆటో ఢీకొని యువకుడు మృతి

అన్నమయ్య జిల్లా రాయచోటి మండల పరిధిలోని ఏపిలవంకపల్లె వద్ద గాలివీడు – కదిరి రోడ్డు మార్గంలో ద్విచక్ర వాహనం ఆటో ఢీకొనడంతో గోవిందు అనే యువకుడు మృతి చెందాడు. యువకుడు బైక్ పై వెళ్తుండగా ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు చింతామణి సమీపంలోని బాగేపల్లికి చెందిన వాడిగా గుర్తించారు. జీవనోపాధి కోసం బోయపల్లెలో ఉంటూ.. రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement