Thursday, March 28, 2024

మార్కాపురంలో అగ్ని ప్రమాదం.. రూ. 20 లక్షల ఆస్తి నష్టం

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సాయి బాలాజీ థియేటర్ వెనకవైపు ఉన్న ప్లాస్టిక్ వేస్టేజ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీ దగ్ధం అయింది. బుధవారం అర్ధరాత్రి 11.30 ప్రాంతంలో మంటలు చెలరేగి.. ఒక్కసారిగా వ్యాపించాయి.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్‌ ఇంజిన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ. 20 లక్షల ఆస్తి నష్టం ప్లాస్టిక్ వేస్టేజీ ఫ్యాక్టరీ యజమాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement