Friday, May 3, 2024

KNL: యువకుడు ఆత్మహత్య.. పీఎస్ ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా

కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో మహేష్ (22) అనే యువకుడు ఇవాళ ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో మృతిచెందాడు.

గతంలో తన అక్క పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అక్క మరణానికి కారణమైన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని జీర్ణించుకోలేక మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు, మాల మహనాడు అధ్వర్యంలో నందవరం పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement