Monday, April 29, 2024

AP | వైసీపీ, టీడీపీ బాహాబాహి.. ఘ‌ర్ష‌ణ‌లో చిరిగిన చొక్కాలు!

చీమకుర్తి , (ప్రభ న్యూస్): ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టుగా సాగుతోంది. నిన్న (మంగ‌ళ‌వారం) రాత్రి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్యక్ర‌మంలో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు పేర్నమిట్ట లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.

రోడ్డుకు అడ్డంగా మోటర్ బైక్ లు పెట్టి ముందుకు సాగ‌కుండా ఆపేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నాయ‌కులు, శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావర‌ణం నెల‌కొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో టీడీపీ, వైసీపీ నాయకుల చొక్కాలు చిరిగాయి, దీన్ని నిరసిస్తూ సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు అక్కడే కూర్చొని ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ను స్థానికులు సమస్యలపై నిల‌దీశారు. కాగా, ఆందోళ‌న‌కు దిగిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు ఒంగోలు పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement