Sunday, April 28, 2024

YCPలో 8 మంది రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు వీరే

తాడేప‌ల్లి – ఏపీలో 175 సీట్లు లక్ష్యంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగులకు సీట్లు గల్లంతు, స్థానాల మార్పిడిపై రాష్ర్ట వ్యాప్తంగా అలజడి రగిలింది. అసంతృప్తితో అలకలు పెరిగాయి. వీటిని నివారించి, ఎందుకు సీట్ల మార్పిడి జరుగుతుందో అర్థమయ్యేలా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తల భుజానికి ఎత్తారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లను నియమించి, వివిధ జిల్లాల బాధ్యతలను అప్పగించారు.

1) బొత్స స‌త్యనారాయ‌ణ – పార్వతీపురం మ‌న్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా,
2) వైవీ సుబ్బారెడ్డి – విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం, అల్లూరి సీతారామ‌రాజు (పాడేరు, అర‌కు నియోజ‌క‌వ‌ర్గాలు) జిల్లాలు,
3) పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి – తూర్పుగోదావ‌రి, కాకినాడ‌, కోన‌సీమ‌, అల్లూరి సీతారామ‌రాజు (రంప‌చోడ‌వ‌రం), ప‌శ్చిమ‌గోదావ‌రి, ఏలూరు జిల్లాలు..
4) ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ – కృష్ణా జిల్లా , ఎన్టీఆర్ జిల్లా , గుంటూరు జిల్లా,
5) విజ‌య‌సాయిరెడ్డి – ప‌ల్నాడు, బాప‌ట్ల‌, ప్రకాశం, నెల్లూరు, తిరుప‌తి జిల్లాలు,
6) పొన్నపురెడ్డి రామ‌సుబ్బారెడ్డి – క‌ర్నూలు, అన్నమ‌య్య‌ జిల్లాలు.
7) ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌ రెడ్డి – వైఎస్సార్ కడప, నంద్యాల‌ జిల్లాలు,
8) పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి – చిత్తూరు, అనంత‌పురం, శ్రీ స‌త్యసాయి జిల్లాల బాధ్యతలు

Advertisement

తాజా వార్తలు

Advertisement