Wednesday, May 8, 2024

AP: భావజాలం లేని పార్టీ వైసీపీ : పవన్‌

మంగళగిరి: వైసీపీ భావ‌జాలం లేని పార్టీ అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. మన పార్టీకి యువత బలం చూసి భాజపా పెద్దలే ఆశ్చర్యపోయారన్నారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చిందన్నారు. తన భావజాలాన్ని నమ్మే యువత వెంట వస్తున్నారన్నారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదన్నారు. పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారన్నారు. యువత ఆదరణ చూసే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేశామన్నారు. ఖమ్మం, మధిర, కూకట్‌పల్లి, దుబ్బాక ఎక్కడికెళ్లినా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతిచ్చారన్నారు.

వైసీపీకి భావజాలం లేదు. ఎందుకోసం పనిచేస్తున్నారో వారికే తెలియదన్నారు. అన్న ముఖ్యమంత్రి కావాలి.. అందుకోసం పనిచేస్తున్నామని చెబుతారన్నారు.తాను ఏం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానన్నారు. సమాజాన్ని ఎలా చూస్తామనే దానిపై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉందన్నారు. హైదరాబాద్‌లో యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటం చాలా బాధ కలిగించిందన్నారు.

తన సినిమాలు ఆపేసినా, తాను బసచేసిన హోటల్‌కు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా.. మన పోరాటం మనమే చేసుకున్నాం తప్ప.. ఏనాడూ జాతీయ స్థాయి నాయకుల వద్దకు వెళ్లి మీ సహాయం కావాలని చేయిచాచి అడగలేదన్నారు. ఎందుకంటే ఇది మన నేల.. మన పోరాటమన్నారు. కుదిరితే మనం వారికి బలం అవ్వాలన్నారు. కానీ, మనం బలం చూపించకపోతే వాళ్లు గుర్తింపు ఇవ్వరన్నారు. పోరాటం చేసే వాళ్లనే వారు గుర్తిస్తారన్నారు. స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నానన్నారు. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుందని పార్టీ శ్రేణులకు పవన్‌ దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement