Monday, April 29, 2024

AP: 50రోజులు సైనికుల్లా ప‌నిచేయండి – కార్య‌క‌ర్త‌ల‌కు స‌జ్జ‌ల పిలుపు

తాడేప‌ల్లి – సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్‌ జగనా ?.. రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబా ? అనేది ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. తాడేప‌ల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ… వైఎస్సార్‌సీపీకి ఎన్నికల టార్గెట్‌ క్లియర్‌గా ఉంద‌న్నారు.. పరీక్షలు రాసే పిల్లల్లా.. రాబోయే ఈ 50రోజులు ఇదే పని చేయాల‌ని కోరారు… సునామీలాగా వస్తున్న ఆదరణను.. పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్ లను(ఒకటి అసెంబ్లీ, రెండోది లోక్‌సభ కోసం) నొక్కించాలని అన్నారు.


2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని ప్ర‌జ‌లు చూశార‌ని,. అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారన్నారు. టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసి వచ్చింద‌ని చెప్పారు. రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈరోజు తాను యువకుడిని అంటూ ఊర్లలో తిరుగుతున్నార‌ని సజ్జల ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం పథకాలను రూపొందించలేద‌ని అంటూ సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రంగా ఏపీని జగన్ తీర్చిదిద్దుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగింద‌ని పేర్కొన్నారు.

అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నార‌ని తెలిపారు. కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉంద‌ని అంటూ వైఎస్సార్‌సీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నార‌న్నారు స‌జ్జ‌ల .. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చామ‌ని, కొన్నింటిలో మైనార్టీలకు 50శాతం పదవులు ఇచ్చామ‌ని పేర్కొన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement