Friday, May 10, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

పెదపారుపూడి : కృష్ణా జిల్లాలో జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో ఓ మ‌హిళ దుర్మ‌ర‌ణం పాలైంది. మండ‌ల కేంద్రం పెదపారుపూడి ప్రధాన సెంటర్లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. గుడివాడ పట్టణం- నాగవరప్పాడుకు చెందిన గొర్ల కృష్ణకుమారి (42) భర్త శ్రీ‌నివాస‌రావుతో కలిసి ద్విచక్రవాహనంపై ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల‌కు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని రోడ్ల మరమ్మతులు ఆధునీకరణ పనులకు ఉపయోగించే యంత్ర వాహ‌నం ఒక ప‌క్క నుంచి ఒక్క సారిగా ట‌ర్న్ కావ‌డంతో ఆ యంత్రం తగిలి దంపతులు కింద‌ప‌డిపోయారు. స‌ద‌రు వాహ‌నం వెనుక టైర్ కృష్ణకుమారి మీదుగా వెళ్ల‌డంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. గాయాల‌తో ప్రమాదం నుండి బయట పడిన ఆమె భర్త శ్రీనివాసరావు పోలీసుల‌కు చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణకుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement