Friday, May 3, 2024

AP: తెనాలిలో మహిళ దారుణ హత్య..

మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తెనాలిలో చోటుచేసుకుంది. తెనాలి పట్టణంలోని గంగానమ్మపేటలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. భవనం వారి వీధిలో నివాసం ఉంటున్న ఆర్.అలేఖ్య (35), రమేష్ భార్యభర్తలు. అయితే, గత కొన్నేళ్ల నుంచి అలేఖ్యను అన్నం శ్రీనివాస్ అనే వ్యక్తిని వేధించేవాడు. చంపుతానని కూడా బెదిరించాడని, అతడి టార్చర్ భరించలేక తమ భార్య ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని రమేష్ తెలిపాడు.

ఈ క్రమంలోనే శ్రీనివాస్‌పై కేసులు కూడా పెట్టామని పేరొన్నాడు. అయితే, కేసు విషయంలో కోర్టులో అతడికి శిక్ష పడే అవకాశం ఉండటంతో శ్రీనివాస్ అలేఖ్యపై కోపాన్ని పెంచుకున్నాడని తెలిపాడు. ఇవాళ ఉదయం పక్కా ప్లాన్ ప్రకారం ఓ పదునైన ఆయుధంతో తన భార్యపై పదునైన ఆయుధంతో శ్రీనివాస్ దాడికి తెగబడ్డాడని మృతురాలి భర్త రమేష్ వెల్లడించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న టూటౌన్‌ పోలీసులు, నిందితుడి రమేష్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement