Saturday, April 27, 2024

చనిపోయే వ‌ర‌కు జ‌గ‌న్ తోనే .. ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి

తాను చనిపోయే వరకు వైఎస్ జగన్ తోనే ఉంటానని కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి స్పందించారు. వైసీపీని వదిలే ప్రసక్తే లేదన్నారు. తాను చనిపోతే తన కుమారుడు రజత్ రెడ్డి కూడా జగన్ తోనే ఉంటారని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం చంద్రబాబు చేస్తున్న కుట్ర అని అన్నారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం.. చంద్రబాబు మైండ్ గేమ్ అని పేర్కొన్నారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వలేదని ఏనాడూ బాధపడలేదన్నారు. చివరికి ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. కావాలని ఏదో విధంగా గందరగోళం సృష్టించి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని.. అందంతా అవాస్తవం అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement