Wednesday, May 1, 2024

కేసీఆర్‌తో గ్యాప్‌‌‌పై విలేకరుల ప్రశ్నకు చిన‌జీయర్ ఏమన్నారంటే!

తమకు ఎవరితో గ్యాప్ లేదని త్రిదండి చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. ఇవ్వాల మీడియాతో మాట్లాడుతున్న సంద‌ర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గ్యాప్ వచ్చిందా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన దీనికి సమాధానమిచ్చారు. తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని అయితే అవతలివాళ్లు గ్యాప్ పెంచుకుంటే తామేమీ చేయలేమన్నారు.

మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామన్నారు. అదే సమయంలో రాజకీయాల్లోకి వస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించడంతో దానికి కూడా జీయర్ జవాబిచ్చారు. తమకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తమ అవసరం ఎవరికైనా ఉంటే వారికి సహాయం చేస్తామని, తాము పెద్దగా ఎవరితో రాసుకుని పూసుకుని తిరగేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement