Friday, May 17, 2024

Flash: 100 అడుగుల లోయలో ప‌డిపోయిన పెళ్లి బ‌స్సు.. 10 మంది మృతి?

తిరుప‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈరోజు (శనివారం) అర్ధ‌రాత్రి వేళ ఘోరం జ‌రిగింది. తిరుప‌తి ద‌గ్గ‌రున్న బాకారాపేట ఘాట్‌రోడ్డులో పెళ్లి బ‌స్సు బోల్తా కొట్టింది. సుమారు 50 అడుగుల లోతులో బ‌స్సు ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది. చీక‌ట్లో ఉన్న వారి ఆర్థ‌నాథాలు త‌ప్ప మ‌రేం క‌నిపించ‌ని ప‌రిస్థితి ఉంది. బ‌స్సులు 56 మంది ఉన్న‌ట్టు స‌మాచారం. కాగా, ధ‌ర్మ‌వ‌రం నుంచి తిరుప‌తికి బ‌య‌లుదేరి వ‌స్తున్న ఈ ప్రైవేటు బ‌స్సు యాక్సిడెంట్‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని త‌ర‌లి వ‌చ్చారు.

రెండు అంబులెన్స్‌లు కూడా ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. సహాయక చర్యలను పోలీసులు వేగవంతం చేశారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం దాదాపు 10మందికి పైగానే చ‌నిపోయి ఉంటార‌ని తెలుస్తోంది. అయితే డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం, అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణమ‌ని తోటి ప్ర‌యాణికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement