Monday, May 6, 2024

Krishna: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో

కృష్ణాజిల్లా : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు మండలం కానూరు ఇండియన్ బ్యాంకులో ఓ వ్యక్తి నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోను ఇవాళ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం… విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట 78వ వార్డ్ సచివాలయానికి చెందిన వీఆర్వో మాధురి సంబంధిత లబ్ధిదారులకు సర్టిఫికెట్ జారీ చేసేందుకు 10,000 లంచం డిమాండ్ చేసింది.


అయితే అంత ఇచ్చుకోలేనని లబ్ధిదారులు చెప్పడంతో ఐదు వేలకు రాజీ కుదుర్చుకున్నారు. ఈ విషయం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందగా.. వారు లబ్ధిదారులు కానూరు ఇండియన్ బ్యాంకులో నగదు వీఆర్ఓకి ఇస్తున్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే వీఆర్ఓ తాను స్వయంగా లంచం తీసుకోకుండా తన భర్త చేతికి ఇప్పించింది. దీంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement