Monday, April 29, 2024

Vizag: 25లక్షల మందికి ఇల్లు కట్టి ఇస్తాం : సీఎం జ‌గ‌న్

25లక్షల మందికి ఇల్లు కట్టి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఇళ్లపట్టాల పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని అడ్డంకులను అధిగమించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17వేల జగనన్న కాలనీలు వస్తున్నాయని, రెండో దశ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. తనకు మంచి పేరు వస్తుందనే బాధతో.. కొందరు ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement