Thursday, May 9, 2024

విశాఖలో జ‌గ‌న్ – నాలుగో తేది వ‌ర‌కూ అక్క‌డే మ‌కాం..

విశాఖ‌ప‌ట్నం – ఎపి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న గ్లోబ‌ల్ ఇన్వేస్ట‌ర్ ల మీట్ లో పాల్గొనేందుకు నేటి సాయంత్రం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విశాఖ చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం నుంచి ప్ర‌త్యేక విమానంలో విశాఖ‌కు బ‌య‌ల్దేరిన సీఎం కొద్దిసేప‌టి క్రిత‌మే విశాఖ‌కు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. . రేపు, ఎల్లుండి విశాఖ‌లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో జ‌గ‌న్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి వ‌చ్చే పారిశ్రామిక వేత్త‌ల‌తో భేటీ కానున్నారు. 4వ తేదీ మ‌ధ్యాహ్నం గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ ముగిసిన అనంత‌రం విశాఖ నుంచి బ‌య‌ల్దేరి తాడేప‌ల్లిలోని త‌న నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement