Friday, May 3, 2024

AP: సామూహిక సూర్య నమస్కారాలు..

అనకాపల్లి, ఫిబ్రవరి 16(ప్రభ న్యూస్): రథసప్తమిని పురస్కరించుకొని అనకాపల్లిలో యోగా లైఫ్ సెంటర్ ఆధ్వర్యంలో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. చిన్న, పెద్ద వయసుతో తారతమ్యాలు లేకుండా 108 పర్యాయాలు సూర్య భగవాన్ ని ప్రార్థిస్తూ యోగాసనాలు చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకుడు కర్ణం బాబురావు మాట్లాడుతూ.. ప్రత్యక్ష భగవానుడైన సూర్యున్ని స్మరిస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నారు. ప్రతి ఏటా రథసప్తమిని పురస్కరించుకొని సూర్య నమస్కారాలు చేస్తున్నామని, తద్వారా ప్రజల్లో చైతన్య నింపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు కరణం రమాదేవి, కరణం దేవిక, మహాలక్ష్మి, టీ మణికంఠ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement