Saturday, April 27, 2024

విజయనగరం జిల్లాలో టైగర్‌ టెన్షన్‌…

విజయనగరం జిల్లాలో టైగర్‌ టెన్షన్‌ కొనసాగుతున్నది. గంట్యాడ మండలంలో పులి దాడిలో గేదె మృతి చెందింది. వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు రావద్దన్నారు. మరోసారి పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. పులి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement