Saturday, April 27, 2024

లారీ, రెండు ఆర్టీసి బ‌స్సులు ఢీః అయిదుగురి దుర్మ‌ర‌ణం…

విజయనగరం లో నేడి ఉద‌యం జ‌రిగి ఘోర రోడ్డు ప్రమాదం అయిదుగురు దుర్మ‌ర‌ణం చెందారు..ప‌లువురు గాయ‌ప‌డ్డారు.. విజయనగరం మండలం లోని సుంకరి పేట దగ్గర ఎదురుగా ఎదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్ లు ఢీకొన్నాయి.. అదే స‌మ‌యంలో మ‌రో లారీ ఈ బ‌స్సుల‌ను ఢీకొంది.. ఈ ప్ర‌మాదంలో రెండు ఆర్టీసీ బస్సుల డ్రైవ‌ర్ల‌తో పాటు ముగ్గురు ప్ర‌యాణీకులు మ‌ర‌ణించారు.. రెండు బ‌స్సుల‌లోని ప్ర‌యాణీల‌కులు గాయ‌ప‌డ్డారు… బ‌స్సులు రెండు నుజ్జు కావ‌డంతో బస్సుల‌లో గాయ‌ప‌డిన ప్ర‌యాణీక‌లను బ‌య‌ట‌కు తీసేందుకు క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.. రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ ని తగలబెట్టడం వల్ల విపరీతంగా పొగ వ్యాపించడం తో ఎదురుగా ఎదురుగా వస్తున్న రెండు బస్ లు ఒక్కదానికి ఒక్కటి స్పష్టంగా కనిపించకపోవడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement