Tuesday, May 7, 2024

పార్వతీపురంలో ఏనుగుల బీభత్సం..

కామరాడ మండలంలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. రావివలసలో పశువుల మందపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఒక ఎద్దు మృతి చెందగా.. మరో రెండు ఆవులకు గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఫారెస్ట్‌ అధికారులు స్పందించి ఏనుగులను బందించి అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలానే వదిలేస్తే ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం పొంచిఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటరిగా బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుందన్నారు. ఏనుగులను బందించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement