Tuesday, May 7, 2024

మ‌ల‌య‌ప్ప‌స్వామిగా వెంక‌టేశ్వ‌ర‌స్వామి-మాడ వీధుల్లో ఊరేగింపు

మ‌ల‌య‌ప్ప‌స్వామి హ‌నుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు వేంక‌టేశ్వ‌ర‌స్వామి. కాగా తిరుమ‌ల‌లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగాకొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించు కోవడానికి భక్తులు కొండపైకి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మొత్తం 28 కంపార్టుమెంట్లలో సర్వ దర్శనానికి భక్తులు వేచి ఉండగా వీరికి దర్శనం 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివ రించారు. నిన్న శ్రీవారిని 81,318 మంది భక్తులు దర్శించుకోగా 38,464 మంది తలనీలాలు సమర్పించుకు న్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.94కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement