Monday, April 29, 2024

వాన్‌పిక్‌ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఢిల్లీ: వాన్‌పిక్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. తదుపరి విచారణ, ఉత్తర్వులిచ్చేవరకు ‘స్టేటస్‌ కో’ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాన్‌పిక్‌కు అనుకూలంగా ఇచ్చిన హైకోర్టు తీర్పుపై ఈడీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసుపై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement