Friday, May 3, 2024

గుర్తు తెలియని మృత దేహం లభ్యం

ప్రకాశం జిల్లా గిద్దలూరు నగరపంచాయితి పరిధిలోని చట్టిరెడ్డి పల్లె సమీపంలో కళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శరీర భాగాలు, కుక్కలు లాక్కొని రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామస్తులను విచారించగా.. గత ఏడాది నవంబర్ నుంచి కొప్పుల వెంకటేశ్వర్లు (28 ) అనే వ్యక్తి కనిపించడం లేదని, అదేనేలలో 22 వ తేదీన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నవంబర్ నెలలో 19 వ తేదీన ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి చనిపోతానని బెదిరించి బయటికి వచ్చినట్లు మృతుని బంధువులు తెలిపారు. ఆ కోణంలోనే పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement